కర్నూలు : సమాజంలో అందరూ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుని భద్రత పెంచుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపునేని రాజకుమారి అన్నారు. కర్నూలులో పోలీసు శాఖ ఆధ్వరంలో మహిళా భద్రత- మనందరి బాధ్యత అన్న అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు నన్నపునేని ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. టీవీ సీరియళ్లపై ఆమె సెటైర్లు వేశారు. ఈ సీరియళ్ల వల్ల ఆడవారికి ఆడవారే శత్రువులుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడానికి అశ్లీల వీడియోలు కూడా ఒక కారణమని నన్నపునేని అన్నారు.