ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీవీ సిరియళ్ల వల్ల ఆడవారికి ఆడవారే శత్రువులుగా మారే పరిస్థితి :నన్నపునేని రాజకుమారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 17, 2018, 10:47 AM

కర్నూలు :  సమాజంలో అందరూ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుని భద్రత పెంచుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపునేని రాజకుమారి అన్నారు. కర్నూలులో పోలీసు శాఖ ఆధ్వరంలో మహిళా భద్రత- మనందరి బాధ్యత అన్న అంశంపై జరిగిన అవగాహన సదస్సుకు నన్నపునేని ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. టీవీ సీరియళ్లపై ఆమె సెటైర్లు వేశారు. ఈ సీరియళ్ల వల్ల ఆడవారికి ఆడవారే శత్రువులుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడానికి అశ్లీల వీడియోలు కూడా ఒక కారణమని నన్నపునేని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com