న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఇక్కడ కొద్ది సేపటి కిందట ప్రారంభమైన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం పే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోవడంపై గళమెత్తుతానని ప్రకటించడంతో అంతరి చూపీ ఆయన వైపే ఉంది. మరో వైపు పలు సమస్యలు ఉండగా సమావేశం అజెండాను కేవలం ఆరు అంశాలకే పరిమితం చేయడం పట్ల రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగానే గళమెత్తుతారని భావిస్తున్నారు. ఒక వేళ అజెండాలో లేని అంశాల ప్రస్తావనకు సమావేశంలో అనుమతించకుంటే అక్కడికక్కడే నిరసన వ్యక్తం చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు.