జమ్ముకశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో ఆదివాసీ సంచార తెగ వారు వేసుకున్న గుడారాలపై కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మహిళలు మృతిచెందగా.. మరో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. వారు పశువులను మేపేందుకు కొండల్లో గుడారాలు వేసుకొని ఉంటున్నారు. కాగా, కొండచరియలు విరిగిపడి భారీ రాయి ఆ గుడారాలపై పడటంతో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు పిల్లలు గాయపడ్డారు. వారిని దవాఖానలో చేర్పించామని పోలీసులు తెలిపారు.