శ్రీనగర్ : ఆర్మీ జవాను ఔరంగజేబ్కు ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఔరంగజేబ్ను అపహరించి, ఆ తర్వాత హత్య చేసిన విషయం తెలిసిందే. ఇవాళ పూంచ్లో జరిగిన అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు. తన కుమారుడు తన వాగ్ధానాన్ని నిలుపుకున్నారని, అతను దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాడని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాదులను తుదుముట్టించాలని ఔరంగజేబ్ తండ్రి మొహహ్మద్ హనిఫ్ డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్కు చెందిన లైట్ ఇన్ఫాంట్రీలో ఔరంగజేబ్ రైఫిల్మ్యాన్గా చేస్తున్నాడు. హిజ్బుల్ ఉగ్రవాది సమీర్ టైగర్ను హతమార్చిన టీమ్లో ఔరంగజేబ్ ఉన్నాడు. అయితే రంజాన్ పండుగ కోసం ఇంటికి వెళ్తున్న ఔరంగజేబ్ను ఉగ్రవాదులు అపహరించారు.