కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ మరో సారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై విమర్శలు గుప్పించారు. అరెస్టయిన హిందూ ఉగ్రవాదులందరికీ ఆర్ఎస్ఎస్ తో లింకులు ఉన్నాయని అన్నారు. ధార్ కు 110 కిలోమీటర్ల దూరంలోఉన్న కుక్షిలో జరిగిన కాంగ్రెస్ మహాసమ్మేళన్ లో ఆయన మాట్లాడారు. అరెస్టయిన హిందూ ఉగ్రవాదులందరికీ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్నాయని చెప్పడానికి తనకు ఎటువంటి సందేహమూలేదని అంటూ….వారందరికీ ఆర్ఎస్ఎస్ తో ఎందుకు సంబంధాలున్నాయో ఆర్ఎస్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ బాంబుల తయారీ ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్నదనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని దిగ్గీరాజా అన్నారు.గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ హిందు ఉగ్రవాదంతో ఆర్ఎస్ఎస్ లింకులపై విమర్శలు గుప్పించిన సంగతి విదితమే.