న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన సతీమణి సవితా కోవింద్తో కలిసి నేడు విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. గ్రీస్, సూరినామ్, క్యూబా దేశాల్లో రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఉక్కు పరిశ్రమలశాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయితో పాటు పలువురు ఎంపీలు రాష్ట్రపతి పర్యటన బృందంలో ఉన్నారు. తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మొదటగా ఏథెన్స్ చేరుకుంటారు. గ్రీస్ అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్లోపోసులోతో భేటీ కానున్నారు. అనంతరం మంగళవారం నాడు రాష్ట్రపతి సూరీనామ్ బయల్దేరి వెళ్తారు. అధ్యక్షుడు డిసైర్ డిలానో బొటెర్స్తో సమావేశం అవుతారు. భేటీలో భాగంగా ఆరోగ్యం, మందులు, ఎన్నికలు, ఐటీ, ఆయుర్వేదం తదితర అంశాలపై ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. అటునుంచి ఈ నెల 21వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్యూబాకు బయల్దేరి వెళ్తారు.