పారిస్: ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ ఈఫిల్ టవర్ చుట్టు కొత్త ఫెన్సింగ్ను నిర్మించారు. ఉగ్రవాదుల దాడుల నుంచి ఈఫిల్ టవర్ను రక్షించేందుకు ఈ ప్రత్యేక ఫెన్సింగ్ను కట్టారు. 2016 జూన్లో పాక్షిక ఫెన్సింగ్ను నిర్మించారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో పర్మనెంట్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. సుమారు 40 మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఈ ఫెన్సింగ్ను కడుతున్నారు. 2015 నుంచి ఫ్రాన్స్లో జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 240 మంది మరణించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పురాతన కట్టడాల చుట్టూ ప్రత్యేక భద్రతను పెంచుతున్నారు. ఈఫిల్ టవర్ను వీక్షించేందుకు ప్రపంచ పర్యాటకులు అక్కడకు వస్తుంటారు. భద్రతా పరంగా కొత్త ఫెన్సింగ్ రాతిగోడలాగా ఉందని అధికారులు అంటున్నారు. టవర్కు రెండు వైపులా గ్లాస్ గోడలను నిర్మించారు. మిగతా రెండు వైపులా మెటల్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. వాహనాలతో దాడులను అడ్డుకునేందుకు ఈ ఏర్పాట్లన్నీ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది కనీసం 70 లక్షల మంది పర్యాటకులు ఈఫిల్ను చూసేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు.