అమరావతి : రంజాన్ పర్వదినం దాతృత్వానికి, సర్వమత సామరస్యానికి ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రంజాన్ వేడుకల సందర్భంగా అమరావతిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల పవిత్రమాసమని, మానవాళి ఆనందంగా ఉండాలని ముస్లిం సోదరులు నెలరోజులపాటు ప్రార్థనలు, ఉపవాసాలు ఉన్నారని ఆయన అన్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో సామాజిక మార్పు సాధ్యమని మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాన్ని ఆచరించే మాసమిదని ఆయన అన్నారు. ఆ సందేశాన్ని మనం ఆచరిస్తూ ప్రజలందరికీ అందిస్తున్నామని ఆయన చెప్పారు.