రావులపాలెం : నాలుగేళ్ల టీడీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు 20 శాతం కూడా పూర్తి కాలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చేరుకున్న సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా చేసిందేమీ లేదన్నారు. పొరుగు రాష్ట్రాలను చూసి కూడా చలనం రావడం లేదన్నారు. చినబాబు నుంచి పెదబాబు వరకూ ఇసుక లంచాలు దోచుకుంటున్నారని వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం నాయకులు ఇసుకను కూడా దోచేస్తున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దొరక్క రైతులు ఆందోళనలు చెందుతున్నారన్నారు. రైతుకు అరటి గెలకు రూ.100 లు కూడా రావడం లేదని, హెరిటేజ్ షాపుల్లో కిలో రూ.35లకు అమ్ముతున్నారని జగన్ ఆరోపించారు.