అమరావతి : బిజెపి, వైకాపాలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లిలో బిజెపి ఎమ్మెల్యే ఆకుల, పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిసి వెళ్లిన వీడియోలు బహిర్గతమయ్యాయని ఆయన చెప్పారు. గతంలో వైకాపా ఎంపి విజయసాయి రెడ్డి పిఎంఒలో తిష్ట వేయడంపై ఫొటోలు వచ్చాయని, ఇప్పడు బుగ్గన బిజెపి నేతలతో కలిసి తిరిగిన వీడియోలు వచ్చాయని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.