అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. నీతీ ఆయోగ్ సమావేశం, తన హస్తిన పర్యటనపై వారితో చర్చిస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడం, పార్లమెంటు వర్షాకాల సమావేశాల నాటికి ఈ ఉద్యమం హీట్ ఢిల్లీకి తాకేలా చేయడం తదితర అంశాలపై ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కడప స్టీల్ ప్లాంట్, విభజన అంశాలపై కూడా ఈ భేటీలో చంద్రబాబు ఎంపీలతో చర్చిస్తారు.