గుంటూరు జిల్లా బోప్పూడి వద్ద కోల్డ్ స్టోరేజిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదం పట్ల కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలని చేసిన దారుణంగా చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజి వాచ్ మెన్ పై దాడి చేసి పెట్రోల్ పోసి కోల్డ్ స్టోరేజికి నిప్పు పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.