ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 14, 2018, 03:42 PM

అమరావతి :  అభివృద్ధికి సహకరించాలి తప్ప అడ్డుకోకూడదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. విభజన సమస్యలు, ఢిల్లిలో నీతి ఆయోగ్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై చంద్రబాబు సమీక్షించారు. కేంద్ర సహకారం లేకున్నా నాలుగేళ్లలో 10.5 శాతం వృద్ధి రేటు సాధించామని ఆయన అన్నారు. వరుసగా మూడేళ్లనుంచి రెండంకెల వృద్ధి రేటు నమోదు చేశామని ఆయన చెప్పారు. కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నా న్యాయబద్ధంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం కేంద్రం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు లేకున్నా ఖర్చు చేస్తున్నామని, పోలవరంలో డయాఫ్రంవాల్‌ విజయవంతంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు. పోలవరం విషయంలో మన వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉంది.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత నిధుల విడుదలో ఆలస్యం సరికాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఇది ప్రజల సెంటిమెంట్‌ అని అయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com