ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప ఉక్కు పరిశ్రమ విషయంలో మరోసారి ప్రజలను మోసం చేశారు: ఎంపీ కేశినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 14, 2018, 01:58 PM

కడప ఉక్కు పరిశ్రమ విషయంలో మరోసారి ప్రజలను మోసం చేశారని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ మోడీ, అమిత్‌షాకు రాష్ట్రం పట్ల ప్రేమ ఉందన్న కన్నా, జీవీఎల్‌ వ్యాఖ్యలు అబద్దాలని తేలిందన్నారు. ఏపీ ప్రజలను తమ అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేంద్రంతో కుమ్మక్కై సొంత జిల్లా ప్రజలను జగన్‌ మోసం చేస్తున్నారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ చేస్తున్న పోరాటానికి జగన్‌ మద్దతివ్వాలన్నారు. కడపలో జరిగే దీక్షలో వైసీపీ ఎంపీలు పాల్గొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com