అమరావతి : తనకు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు అందలేదని వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడిన ఆయన తిరుమల నగల మాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఖజానా అని చెప్పి దేవస్తానం నగలు, సొత్తును ఇష్టానుసారంగా తరలించారని ఆయన ఆరోపించారు. ఆ విషయాన్ని రుజువు చేస్తానని సవాల్ చేస్తూ గతంలో తాను 13 గంటల సమయం ఇస్తే చంద్రబాబు స్పందించలేదని విజయసాయిరెడ్డి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం అవినీతిని బయటకు తీస్తామని చెప్పారు.