ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ బంగ్లాను ధ్వంసం చేయలేదు : అఖిలేష్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 13, 2018, 02:28 PM

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తాను నివాసమున్న ప్రభుత్వ బంగ్లాను ధ్వంసం చేయలేదని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు నివసించిన బంగ్లాలో టైల్స్‌తో సహా అన్ని తీసుకుపోయారనే ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాధికారులు ముందుగా బంగ్లాలోకి వెళ్లి పరిశీలించారని, వారే భవనానికి నష్టం కలుగజేశారని అఖిలేష్‌ అన్నారు. ఆ భవనంలో స్విమ్మింగ్‌ పూల్‌ ఎన్నడూ లేదని, భవనం ఫొటోలు ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్నాయని, వాటిని చూడవచ్చునని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com