దిల్లీ: మణిపూర్లో నేడు జరిగిన తొలి దశ పోలింగ్లో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 69శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్లో నేటి ఆరో దశ పోలింగ్ మధ్యాహ్న సమయానికి సుమారు 38శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మణిపూర్లో ఉక్కుమహిళ ఇరోం షర్మిల ఖురాయ్ నియోజకవర్గం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణిపూర్కు తొలి దశలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 168 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్లో ఆరో దశ పోలింగ్లో గోరఖ్పూర్, అజాంగఢ్, మహరాజ్గంజ్, కుషీనగర్, దేవరియా, మవు, బలియా నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నానికి 38శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో ఈ దశలో 635 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చివరి దశలో పోలింగ్ జరగనున్న వారణాశి నియోజకవర్గంలో నేడు ప్రధాని మోదీ, యూపీ సీఎం అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.