ఆంధ్రప్రదేశ్లోని 5000 మంది తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నవంబర్ 25, 1993 ముందు నుంచి ఉండే తాత్కాలిక ఉద్యోగులకు పదవ పీఆర్పీ ప్రకారం జీతభత్యాలు అందించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కాల్వ శ్రీనివాస్ ప్రకటన చేశారు. ఈ సిఫార్సులను కేబినెట్ ఆమోదం కోసం పంపిస్తున్నామని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.21కోట్ల భారం పడనుందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.