పశ్చిమగోదావరి: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరింది. ఇప్పటివరకు జగన్ 2300కిలోమీటర్ల మేర నడిచారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్ రోడ్డు వద్ద ఈ మైలురాయిని చేరారు జగన్. ఈ సందర్భంగా అక్కడ గుర్తుగా ఓ మొక్కను నాటారు. కాగా వైఎస్ జగన్ పాదయాత్ర సోమవారం 186వ రోజుకు చేరగా, కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.