సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఉదయం సింగపూర్ ప్రధాని లీ హెసైయన్ లూంగ్తో సమావేశం కానున్నారు. చారిత్రాత్మక సమ్మిట్లో భాగంగా మంగళవారం ఉత్తర కొరియా అధ్యక్షుడుతో ట్రంప్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ట్రంప్, సింగపూర్ ప్రధాని ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సమావేశం అనంతరం విందుకు హాజరవుతారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ తెలిపారు. జూన్ 12న సమావేశానికి అమెరికా అధ్యక్షుడితో పాటు రాష్ట్ర కార్యదర్శి, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, నేషనల్ సెక్యూటరీ అడ్వైసర్ హాజరవుతారని ఆమె తెలిపారు.
దక్షిణ కొరియాకు చెందిన మాజీ అమెరికా రాయబారి సుంక్కిమ్, ఉత్తర కొరియా ప్రతినిధి బృందానికి రిట్జ కార్ల్టన్ హోటల్లో నిర్వహించే సమావేశానికి సంయుక్తంగా నాయకత్వం వహిస్తారని ఆమె తెలిపారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదివారం సాయంత్రం సింగపూర్ ప్రధానితో సమావేశమయ్యారు. సమ్మిట్కు ఏర్పాట్లు చేసిన సింగపూర్ ఆర్గనైజేషన్కి, ప్రధాని లీకి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అభినందనలు తెలిపారు. ఎస్జిడి సమ్మిట్కు సింగపూర్ ప్రభుత్వం 20 మిలియన్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి, సుస్థిరతకు ఈ సమ్మిట్ అవకాశాలను కలిగిస్తుందని సింగపూర్ ప్రధాని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం సమ్మిట్ను 2,500మంది జర్నలిస్టులు రిపోర్ట్ చేయనున్నారు.