నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణం ఆరాధనా నగర్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతులు బీజేపీ కార్యకర్త కమలాకర్ పవన్కర్తో సహా అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణం కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.