ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెదేపాలోనే కొనసాగుతా:మంత్రి అఖిలప్రియ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 10, 2018, 04:19 PM

తను పార్టీ మారబోతున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండించారు మంత్రి అఖిలప్రియ. తను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, తను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మంత్రి ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచినే మళ్లీ పోటీ చేస్తానని, ఈ సీటును గెలిచి టీడీపీ అధినేత చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని ఆమె అన్నారు. 



మహానాడు సమయంలో యాక్టివ్ గా కనిపించని మంత్రి నవనిర్మాణ దీక్షను నిర్వహించారు. తను తెలుగుదేశంలోనే ఉంటానని ప్రకటించారు. పార్టీ మార్పు ఊహాగానాలను ఆపే ప్రయత్నం చేశారు. 

ఇదే సమయంలో తను మళ్లీ ఆళ్లగడ్డ నుంచినే పోటీ చేస్తానని అఖిల ప్రకటించడం విశేషం. ఈ సీటు విషయంలో ఆమె పోటీని ఎదుర్కొంటున్నారు. భూమా నాగిరెడ్డి సన్నిహితుడు అయిన ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు వద్ద ఆయన మంత్రాంగాన్ని నడుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను కూడా చేపట్టారు ఏవీ. ఆ సమయంలో అఖిలప్రియ వర్గానికి, ఏవీ వర్గానికి మధ్యన పోరు జరిగింది. రాళ్లు రువ్వుకోవడం వరకూ వెళ్లింది వ్యవహారం. ఆ తర్వాత తెలుగుదేశం అధినేత వీరి మధ్యన పంచాయితీ చేశారు. తను సర్వే చేయిస్తానని దాంట్లో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ అని బాబు అప్పుడు స్పష్టం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అనంతరం అఖిల వైఎస్సార్సీపీలోకి అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె ఆ ప్రచారాన్ని ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com