ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:48 PM

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ కారుపై దాడి ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. రాజధాని రైతులను ఆదుకుంటే దాడులు చేస్తారా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదన్నారు.ఈ దాడి ఘటనను బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని పవన్ అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com