బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లలో శుక్రవారం పిడుగుపాటుకు సుమారు 18 మంది మరణించారు. ఒక్క బీహార్లోనే 11 మంది మరణించగా, మూడు రాష్ట్రాల్లో 13 మంది గాయపడ్డారు. ఈ పిడుగుపాటుకు బీహార్లోని సహారా జిల్లాలో ఆరుగురు మరణించగా, దర్భాంగా జిల్లాలో నలుగురు, మాధేపురా జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్గ్రేషియాను బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో జౌన్పూర్, రారుబరేలీ జిల్లాల్లో ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. హిమాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఈ వారాంతాల్లో సిమ్లా, సోలన్, సిర్మూర్, మండి, కులు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్లో తేలికపాటి వర్షాలుండగా పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో వేడి వాతావరణం కొనసాగింది.