బెంగళూరు: చిన్నస్వామి మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. భుజం గాయంతో బాధపడుతున్న మురళీ విజయ్ స్థానంలో ఓపెనింగ్కు వచ్చిన అభినవ్ ముకుంద్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. మూడో ఓవర్లో స్టార్క్ వేసిన యార్కర్ లెంగ్త్ బంతిని అంచనా వేయలేక ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ 15/1తో ఉంది.