తిరువనంతపురం: అంతర్జాల సదుపాయాన్ని పొందడం కేరళలో ప్రజల హక్కుగా మారనుంది. 20 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా అంతర్జాల సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. 2017-18 బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ఆసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రూ.1,000 కోట్లతో 18 నెలల్లో ‘కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్’ను నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా అంతర్జాల సౌకర్యాన్ని ప్రజల హక్కుగా మారుస్తామని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందే సామాజిక మాధ్యమాల్లో సదరు పత్రాలు లీకయ్యాయంటూ కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికమంత్రి కార్యాలయమే వాటిని లీక్ చేసిందని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల ఆరోపించారు. స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ ఘటనను పరిశీలిస్తామని హామీ ఇచ్చినా.. ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.