ఒడిశా: ఖండాంతర బాలిస్టిక్ అగ్ని-5 ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని అబ్దుల్కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణశాఖ వెల్లడించింది. ఆరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెక్ అయినట్లు రక్షణశాఖ తెలిపింది. ప్రయోగాన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలతో పరిశీలించామని, అగ్ని-5 క్షిపణి నిర్ణీత దూరం చేరుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అగ్ని-5 క్షిపణి 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.