విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చీపురుపల్లిలో పోరాట యాత్ర నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పవన్ తన పోరాట యాత్రను నిర్వహిస్తున్నారు. పోరాట యాత్రలో పవన్ మాట్లాడుతూ...అక్రమంగా గనులు తవ్వేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అవినీతికి తావులేని పాలన ఇస్తామంటేనే టీడీపీకి సపోర్ట్ చేశానన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఇసుక మాఫియాతో తేలిపోయిందన్నారు.