విజయవాడలో మూడో రోజు తెలుగుదేశం మహానాడు ప్రారంభమైంది. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న తెలుగుదేశం మహానాడు మూడో రోజైన ఇవాళ ముగియనుంది. మహానాడులో ఇవాళ టీడీపీ 13 తీర్మాణాలను ప్రవేశపెట్టనుంది. నేటి తెలుగుదేశం మహానాడులో కేంద్ర వైఫల్యాలపై వరుస తీర్మానాలు చేస్తున్నారు. మహానాడులో ప్రజా రాజధాని-మన అమరావతి-ఆనందనగరంపై చర్చిస్తున్నారు. మహానాడులో నీతి ఆయోగ్ సహా కేంద్రానికి సమర్పించిన యూసీలను ప్రదర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేసిన ఖర్చుల వివరాలు తెలుగుదేశం మహానాడులో ప్రదర్శిస్తున్నారు. మొత్తం 8 ఆధారసహిత డాక్యుమెంట్లను టీడీపీ నేతలు ప్రదర్శించారు.