విజయవాడలోని సిద్ధార్థ కళాశాల మైదానంలో రెండో రోజు తెలుగుదేశం మహానాడు సమావేశాలు ప్రారంభమయ్యాయి. మహానాడుకు సీఎం చంద్రబాబు నాయుడు, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణలు హాజరయ్యారు. ఇవాళ మహానాడులో 16 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. మహానాడులో ఏపీ నుంచి 9, తెలంగాణ నుంచి 4, మూడు ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ ఆవిర్భావం, సామాజిక న్యాయం, రాజకీయ చైతన్యంపై, మహానాడులో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట, టీడీపీ ప్రగతిబాటపై చర్చించనున్నారు. మహానాడులో 2019 నాటికి పోలవరం పూర్తి చేసే సంకల్పంపై తీర్మానం చేయనున్నారు.