‘మహానటి’ టీంకు ప్రశంసల వెల్లువలు ఆగడం లేదు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు మహానటి టీంను సత్కరించగా.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మహానటి’ టీంకు సన్మానం చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక, స్వప్నాదత్, హీరోయిన్ కీర్తి సురేశ్, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరిలను చంద్రబాబు సత్కరించారు. కాగా విడుదలై మూడు వారాలు దాటినా ఈ చిత్రం థియేటర్లలో ఇంకా సత్తా చాటుతోంది. అటు తమిళనాడు, కేరళలోనూ మంచి కలెక్షన్లను రాబడుతోంది మహానటి.