శ్రీకాకుళం: ఉపాధి బకాయిలు చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఎల్బీజీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉపాధి కార్మికులకు రూ.300 వేతనం ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని, పోస్టల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 30 తేదీన అన్ని ఎంపిడిఓ కార్యాలయాలు వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు.