రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్లో జరుగుతున్న మోడీ ప్రభుత్వ విజయోత్సవ సభలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2019లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.