న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలమైందని బీఎస్పీ నేత మాయావతి అన్నారు. మోదీ ప్రభుత్వానికి నాలుగేళ్లు నిండిన నేపథ్యంలో ఆమె ఈ కామెంట్ చేశారు. ప్రతిదీ చరిత్రాత్మకమని మోదీ చెప్పుకుంటారని, అందుకే ప్రస్తుతం ఇంధన ధరలు కూడా చరిత్రాత్మక స్థాయిలో పెరిగాయని విమర్శించారు.