కడప జిల్లాలోని చెన్నూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టోల్గేట్ సమీపంలో ఓ ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు అంటుకొని పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో వ్యర్థ పదార్థాలు తగలబడడంతో గిడ్డంగిలోని మిషనరీ పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో రూ.30లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా యజమాని వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ వెనుక నుంచి నిప్పు పెట్టినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.