తిరుమల విషయంలో రాజకీయ జోక్యాన్ని సహించమని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అశాంతి కలిగించే నేరపూరిత చర్యలను చూస్తూ ఊరుకోమన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మౌళిక వసతులను పటిష్టం చేస్తున్నామన్నారు. అంతరాష్ట్ర దోపిడీ ముఠాల విషయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.