శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కాట్రా జిల్లా పరిధిలో గల త్రికూట పర్వతాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపిస్తున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. పెద్దపెద్ద బకెట్లతో కూడిన నీటిని హెలికాప్టర్లు మోసుకెళ్లి మంటలపై వెదజల్లుతున్నాయి.