విశాఖపట్టణం: వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆభరణాల కోసమే తిరుమలలోని పోటులో తవ్వకాలు చేశారని ఆయన బుధవారం ఆరోపించారు. తిరుమలేశుడికి చెందిన కొన్ని ఆభరణాలను స్విట్జర్లాండ్లో వేలం వేశారని ఆయన విమర్శించారు. ఈ అంశంలో కేంద్ర దర్యాప్తు బృందం చేత విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్, అమరావతిలో ఉన్న చంద్రబాబు నివాసాల్లో సోదాలు చేస్తే, కొన్ని ఆభరణాలు చిక్కుతాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.