న్యూఢిల్లి : తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసుల కాల్పుల్లో 13 మంది మరణించిన సంఘటనపై ఎన్హెచ్ఆర్సి అధికారులతో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన ఒక న్యాయవాది ఢిల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై తమిళనాడు డిజిపిని లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నివేదిక కోరడం కంటే ఎన్హెచ్ఆర్సి అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపితే బాగుంటుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లి హైకోర్టు రేపు విచారణ జరిపే అవకాశముంది.