చెన్నై : తూత్తుకుడి సంఘటనపై ముఖ్యమంత్రి పళనిస్వామితో చర్చించడానికి ప్రతిపక్షనేత, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ సచివాలయానికి వచ్చారు. అయితే ముందస్తుగా అనుమతి తీసుకోలేదనే కారణంగా స్టాలిన్ను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి పోలీసులు అనుమతించలేదు. దీనితో స్టాలిన్ తమ పార్టీ నాయకులతో కలిసి సచివాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు స్టాలిన్, ఇతర డిఎంకె నేతలను అరెస్టు చేశారు.