తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 27 గంటల సమయం పడుతోంది. ఇక నడక దారి భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి నాలుగు గంటలు పడుతోంది.