ప్రాంతీయ పార్టీ బలోపేతమే మా లక్ష్యమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన మమతా బెనర్జీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు. దేశాభివృద్ధి కోసం మేమంతా కృషి చేస్తామన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం మేమంతా కలిశామని పేర్కొన్నారు. జేడీఎస్ను బలోపేతం చేయడానికే మేం వచ్చామన్నారు. తూత్తుకుడి ఘటన బాధాకరమన్నారు.