బెంగళూరు :ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బెంగళూరులో మమతా బెనర్జీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమార స్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీరిరువురూ బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురూ కొద్ది సేపు సమావేశమై దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జేడీఎస్ కు ప్రాంతీయ పార్టీలన్నీ అండగా ఉంటాయన్నారు. కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా బీజేపీయేతర శక్తులు, ప్రాంతీయ పార్టలు ఏకతాటిపై రావాల్సిన అవసంర ఉందన్నారు. దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేస్తామని చంద్రబాబు అన్నారు.