రమణ దీక్షితులకు వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగ సంఘాలు ఏకమవుతున్నాయి. రమణ దీక్షితులుపై టీటీడీ ఉద్యోగులు ఈవోకు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే రమణ దీక్షితుల వ్యాఖ్యలకు నిరసనగా మూడు రోజులు నిరసనలు తెలపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈవోకు ఫిర్యాదు అనంతరం ఉద్యోగ సంఘాలు తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నాయి. రమణ దీక్షితులికి వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘాలు ఏకమౌతున్నాయి. టీటీడీ ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఉద్యోగులు ర్యాలీగా ఈవోకు రమణదీక్షితులుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే రమణదీక్షితులు వ్యాఖ్యలకు నిరసనగా మూడు రోజుల పాటు నిరశన దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.