ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి: పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 12:05 PM

శ్రీకాకుళం: ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, ఏపీలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ పలాసలో కిడ్నీ బాధితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు చెప్పాలంటే మంత్రి లేకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు వెంటనే ఆరోగ్యమంత్రిని కేటాయించాలన్నారు. కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక అధికార యంత్రాంగం ఏర్పాటు చేయాలన్నారు. కిడ్నీ రోగులకు ప్రాథమిక చికిత్స సరిగా అందడం లేదన్నారు. కనీసం సురక్షిత నీరు కూడా అందుబాటులో లేదని విమర్శించారు. కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్‌ వర్క్‌ జరగాలన్నారు. కిడ్నీ సమస్య ఉందని ఆఖరి దశ వరకు తెలియడం లేదని పేర్కొన్నారు. బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు కావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com