నిఫా వైరస్ బాధితులకు సేవ చేస్తూ వైరస్ సోకి మృతి చెందిన నర్సు లిని భర్తకు ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని కేరళ మంత్రిమండలి నిర్ణయించింది. లిని పిల్లలిద్దరికి చెరొక 10 లక్షల రూపాయిల పరిహారం చెల్లించాలని మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే నిఫా వైరస్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయిల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.