శ్రీనగర్ : పాకిస్తాన్ రేంజర్లు అంతర్జాతీయ సరిహద్దు వెంట జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు గాయపడ్డారని జమ్ము కాశ్మీర్ డిజిపి ఎస్పి వేద్ చెప్పారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రామ్గఢ్ సెక్టార్లోని అరసఫురా, ఆర్నియా, రామ్గఢ్, సాంబా, హిరానగర్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారని ఆయన అన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.