కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. దత్తాత్రేయ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన చంద్రబాబు మాట్లాడుతూ చిన్న వయసులోనే కుటుంబానికి దూరం కావడం పెనువిషాదమన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న వైష్ణవ్ అకాల మరణానికి గురికావడం కలచివేసిందన్నారు.