కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యూ జ్యోతుల నెహ్రూ నివాసంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నది. జ్యోతుల నెహ్రూ స్వగ్రామమైన ఇర్రిపాకలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతో పాటు గ్రామంలో ఆయన బంధువులు, స్నేహితుల నివాసాలలో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.