తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 44 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు స్వామి వారి దర్శనం లభించడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కూడా స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.